Striking Rtc Workers Attack On Employees Who Joined Duty Mahabubnagar
Striking RTC workers attack on Employees who joined duty - Mahabubnagar
Advertisement
మహబూబ్ నగర్ లో ఆర్టీసీ కార్మికుల నిరసన ఉద్రిక్తంగా మారింది. బస్సులను అడ్డగించిన కార్మికులు…విధుల్లో చేరిన వారిపై దాడికి దిగారు. బస్సులోంచి కండక్టర్, డ్రైవర్ ను బయటకు లాగి కొట్టారు. చెప్పులతో కొడుతూ దాడికి దిగారు. విధుల్లో చేరిన కార్మికుల ఫ్లెక్సీలు పెట్టి.. చెప్పుల దండలు వేసి ర్యాలీ చేశారు. విధుల్లో చేరిన కార్మికులపై దాడిని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు వచ్చిన కార్మికులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో.. డిపోముందు బైఠాయించి నిరసన తెలిపారు.